హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న ప్రారంభించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఫ్యాక్టరీని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్కుమార్, ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్, హరీశ్రావుకు ఆహ్వానాలు అందించినట్టు వెల్లడించారు.
మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిదులందరికీ ఆహ్వానాలు అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు రైతు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నా రు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీ దగ్గర రూ.80 కోట్లతో నిర్మించే రిఫైనరీ యూనిట్కి శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి తెలిపారు.