దండేపల్లి, ఆగస్టు 23: నిరుద్యోగ నిరాహార దీక్ష పేరిట వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రాజకీయం చేస్తున్నారని.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నరేశ్ తండ్రి శంకర్నాయక్ ఆరోపించారు. మంచిర్యాల దండేపల్లి మండలం లింగాపూర్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు బుక్యా నరేశ్నాయక్ వ్యక్తిగత కారణాలతో ఈనెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం రాక నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ మంగళవారం షర్మిల తన ఇంటివద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిసిందన్నారు. అసలే కొడుకు చనిపోయిన బాధలో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పరామర్శ యాత్రకు రావడం సరికాదన్నారు. తన కుమారుడి మరణాన్ని రాజకీయం చేయొద్దని షర్మిలను కోరారు.