హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్-2022 ఓపెన్ క్యాటగిరీలో తమ విద్యార్థి తనిష్క ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించినట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పీ శరణినారాయణ, డాక్టర్ పీ సింధూర నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని క్యాటగిరీల్లో టాప్ టెన్లో ఆరు ర్యాంకులు, 100లోపు 29 ర్యాంకులు, 1000లోపు 324 ర్యాంకులు సాధించి తమ విద్యార్థులు కొత్త రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారు అభినందనలు తెలిపారు.