హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఆధునిక వ్యవసాయాన్ని పునర్నిర్వచించటానికి, పంట ఉత్పాదకతను అపూర్వస్థాయికి పెంచటానికి ‘నానో డీఏపీ’ అనే విప్లవాత్మక ఎరువును ప్రారంభించినట్టు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ నెల 5 వరకు నిర్వహించే అగ్రిటెక్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించినట్టు పేర్కొన్నది.
సుస్థిరమైన, సుసంపన్నమైన వ్యవసాయాభివృద్ధికి ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో వివిధ ఎస్హెచ్జీల నుంచి 110 కంటే ఎక్కువ మంది మహిళలకు డ్రోన్ ఆపరేషన్లలో శిక్షణ ఇచ్చి, ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించినట్టు కోరమాండల్ ప్రముఖ ప్రతినిధి జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. రైతులకు ట్రాక్టర్లు, వెండి నాణేలు బహుమానంగా అందజేసేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అదృష్ట డిప్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.