హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్పై కేసు నమోదుచేయాలని నాంపల్లిలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. న్యాయవాది కరం కొమిరెడ్డి దాఖలుచేసిన పిటిషన్ను శుక్రవారం విచారించిన కోర్టు, ఆమెపై ఐపీసీ సెక్షన్ 504, 505 కింద కేసు నమోదు చేయాలని , దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చింది.
అమ్మకానికి