హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆయిల్ఫెడ్లో ‘కాసులిస్తే కాం ట్రాక్టు.. లేదంటే కట్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. ఈ కథనంపై ఆయిల్ఫెడ్తోపాటు ప్రభుత్వ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరిగింది. అంతేకాకుండా ఈ కథనంపై ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు సైతం ఆరా తీశారు. కాసుల దందా చేస్తున్న ఆ అధికారి ఎవరు? ఆ దందా ఏంది? అని విచారణ చేశారు.
ఈ కథనం ముమ్మాటికీ నిజమేననే, సదరు అధికారి అమాయకత్వంగా నటిస్తూ మాయమాటలతో మంత్రిని తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా తన లెక్క తేలితే మంత్రికి ఏదో చెప్పి కాంట్రాక్టును కొనసాగించేవారని, కానీ అది బెడిసికొట్టడంతోనే మంత్రి ఆదేశాలు అమలుచేశారని తెలిసింది.