భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 19(నమస్తే తెలంగాణ): భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్తో కలిసి కలెక్టర్ అనుదీప్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిల్డర్స్, విజిటర్స్, ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. డీటీసీపీ అప్రూవల్స్ తీసుకొని అపార్టుమెంట్స్, వెంచట్లు ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొని వారి అభిమానాన్ని చూరగొనాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవనాలను నాణ్యతగా నిర్మించాలని కోరారు. ప్రజల ఆసక్తికి అనుగుణంగా, వారి అవసరాలను బట్టి ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తే కొనుగోలుదారులు ఇండ్లను, ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే బృందానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్టాల్స్ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచతోపాటు ఖమ్మం, హైదరాబాద్లకు చెందిన 22 రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. ప్రాపర్టీ షోకు డివైన్ హోమ్స్ శ్రీనివాస హైట్స్, శ్రీబాలాజీ ఎస్టేట్ మెయిన్ స్పాన్సర్స్గా, శ్రీజయవిలాసిని అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు గిఫ్ట్ పార్టనర్స్గా టీ న్యూస్, నీలోఫర్ సంస్థలు వ్యవహరించాయి. కార్యక్రమంలో శ్రీశ్రీనివాస హైట్స్ అధినేత దమ్మాలపాటి శ్రీనివాసరావు, శ్రీబాలాజీ ఎస్టే ట్స్ అండ్ కన్స్స్ట్రక్షన్స్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరాజు, జయవిలాసిని డెవలపర్స్ మేనేజర్ ఖాజా, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జీఎం సురేందర్రావు, డీజీఎం రాజిరెడ్డి, బ్రాంచి మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జ్ మాటేటి వేణుగోపాల్, ఎడిషన్ ఇన్చార్జ్ కాయల పూర్ణచందర్రావు, అడ్వైర్టెజ్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ బోయిన శేఖర్బాబు పాల్గొన్నారు.