హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం స్వయంపాలనలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలను, వాటిని ప్రజలు అనుభవిస్తున్న తీరును వారి మాటల్లోనే సేకరించి ‘సామాన్యుడి మాట’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సంపాదకీయం పేజీలో ఒక కాలం నడిపించింది. ఈ కాలంను రచయిత గడ్డం సతీశ్ సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్నారు. ఈ వ్యాసాలన్నింటినీ కలిపి సతీశ్ సామాన్యుడి మాట పేరిట ఓ సంకలనంగా తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నమస్తే తెలంగాణ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను అప్పగించిన పనిని గడ్డం సతీశ్ నూరుశాతం పూర్తిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి ఎస్జీవీ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎడిటర్ తుమ్మలపల్లి రఘురాములు, చీఫ్ ఆఫ్ బ్యూరో ఓరుగంటి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.