తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ నిపుణ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. ప్రముఖ నిపుణలతో ఈ సదస్సు ప్రారంభమైంది. మీరు కూడా ఏం చదవాలో.. ఎలా చదవాలో ఈ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. సదస్సుకు నమస్తే తెలంగాణ ఎడిటర్ టీ కృష్ణమూర్తి హాజరై, ప్రారంభోపన్యాసం చేశారు.. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప పాల్గొన్నారు.