కమాన్చౌరస్తా, మార్చి 23: కరీంనగర్ జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన ఆటో షోకు ఆదరణ లభించింది. నగరం నడిబొడ్డున ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) గ్రౌండ్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ షోను శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మేయర్ వై సునీల్రావు, నమస్తే తెలంగాణ అడ్వటైజ్మెంట్ జనరల్ మెనేజర్ ఎన్ సురేందర్రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా బ్రాంచ్ మేనేజర్ ప్రకాశ్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వాహన స్టాల్స్ను పరిశీలించి వాటి గురించి తెలుసుకున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్రావు నడిపి సంతోషం వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడు తూ.. మార్కెట్లో టాప్ బ్రాండ్లకు మంచి గిరాకీ ఉన్నదని, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంపోర్టెడ్ వాహనాలను తెప్పించుకుంటున్నారని చెప్పారు. అలాంటి అన్ని రకాల వాహనాలు జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేసిన ‘నమస్తే తెలంగాణ’ మరోసారి ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. బెంజ్, వోల్వో వంటి పెద్ద వాహనాలు నగరంలో ప్రదర్శనకు రావడం మంచి విషయమని చెప్పారు.
ఈ రోజుల్లో ప్రతి కుటుంబం కారు ఉండాలని కోరుకుంటున్నదని, అలాంటి అన్ని వర్గాలకు అవసరమైన వాహనాలు ఈ షోలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని వీక్షించి, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ.. నగర ప్రజలకు అందుబాటులో నగరం నడిబొడ్డున ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో వాహనాల ప్రదర్శన ఏర్పాటు చేయడం శుభపరిణామం అని చెప్పారు.
నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జనరల్ మెనేజర్ ఎన్ సురేందర్రావు మాట్లాడుతూ.. వాహనాలు కొనాలనుకునేటప్పుడు కొందరు ైస్టెల్ చూస్తారని, మరికొందరు మైలేజ్, సేఫ్టీ, డబ్బులు చూస్తారని, అలాంటి అన్ని వర్గాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చేందకు ‘నమస్తే తెంగాణ’ ఆధ్వర్యంలో ఇలాం టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడికొచ్చిన వినియోగదారులకు, పాఠకులకు అన్ని ర కాల వాహనాలు అందుబాటులో ఉండటంతోపా టు, వారి బడ్జెట్లో ఎలాంటి వాహనాలు వస్తాయి? రుణ సుదుపాయం ఎలా ఉంటుంది? అని తెలిపేందుకు బ్యాంకులు ఇక్కడే ఉన్నాయని తెపారు.