నల్లగొండ, డిసెంబర్ 10: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా నల్లగొండ నాగార్జున కళాశాల (ఎన్జీ)లో ఏర్పాటుచేసిన ఆటోషోకు తొలిరోజు విశేష స్పందన వచ్చింది. పట్టణంలో ఇప్పటివరకు ఇలాంటి ఆటోషోలు నిర్వహించకపోవడంతో సందర్శకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శనివారం ఆటోషోను జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రారంభించారు. 19 ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొని వివిధ రకాల బైక్లు, కార్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను విక్రయానికి ఉంచాయి.
వాహనాల కొనుగోలుకు ప్రజలు పెద్దఎత్తున రాగా.. బుకింగ్ చేసుకొన్న వారికి ఆయా కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్లు ఇచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర సహకార బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు కొనుగోలుదారులకు రుణ సౌకర్యం కల్పించాయి. సందర్శకుల్లో ఇద్దరిని లక్కీ డ్రాలో ఎంపిక చేసి కేఫ్ నిలోఫర్ సహకారంతో బహుమతులు అందజేశారు. బైక్లు కొన్నవారికి కనిష్ఠంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు, కార్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు తగ్గింపుతోపాటు వాహనాల్లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసి అందజేశారు.
దూసుకుపోతున్న ఆటో రంగం
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆదాయ వనరులు పెరిగి, తలసరి ఆదాయం పెరుగడంతో మార్కెట్లో ఆటోమొబైల్ రంగం దూసుకుపోతున్నదన్నారు. వాహనాలు కొనేందుకు కొనుగోలుదారులు షోరూమ్స్ వెతుక్కోవాల్సిన పనిలేకుండా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆటోషో ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జనరల్ మేనేజర్ ప్రశాంత్కుమార్ బారియర్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జనరల్ మేనేజర్ సురేందర్రావు, ఏజీఎం రాజిరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్రెడ్డి, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ శివకుమార్, సర్క్యులేషన్ మేనేజర్ మల్సూర్గౌడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ వీరన్న నాయక్, కౌన్సిలర్లు ఊట్కూరి వెంకట్రెడ్డి, ఖయ్యూంబేగ్, రావుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.