హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు, నమస్తే తెలంగాణ సంస్థ సీఎండీ దీవకొండ దామోదర్ రావు (MP Damodar rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిన్న వయస్సులోనే సాయిచంద్ మరణం తనను కలచివేసిందని అన్నారు. తెలంగాణ సమాజం గొప్ప ప్రజా కళాకారుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో, రాష్ట్ర సాధన తర్వాత ప్రగతి గానంలో సాయిచంద్ పాత్ర మరువ లేనిదని దామోదర్ రావు అన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సాయిచంద్.. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా కారుకొండలోని తన ఫామ్హౌస్కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు (Heart attack) రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం వనస్థలిపురంలోని సాహెబ్నగర్లో ఉన్న స్మశానవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరుగనున్నాయి.