యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానం గోపురం స్వర్ణ తాపడానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. భక్తుల నుంచి విరాళాలు వెల్లువల వస్తున్నాయి. మహాధ్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ తమవంతుగా విరాళాలు అందజేస్తున్నారు.
తాజాగా ఆదివారం నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు విమాన గోపురం స్వర్ణ తాపడానికి రూ. 50 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో గీతకు అందజేశారు. అనంతరం ఆలయపునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే హెటిరో డ్రగ్స్ కంపెనీ తరఫున బండి పార్థసారధి రెడ్డి రూ. 1.50 కోట్ల చెక్కును ఆలయ ఈవోకు అందజేశారు.