యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధా నార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులును ఆగమరత్న చూడామణి బిరుదు వరించింది. తమిళనాడులో అతిపెద్ద వైష్ణవ ఆలయం శ్రీరంగంక్షేత్రానికి అనుబంధమైన శ్రీ పౌండరీకపురం శ్రీమదాండవన్ ఆశ్రమ పీఠాధిపతులు.. ఆయనకు సాహితీ వైభవ పురస్కారంగా బిరుదును ప్రదానంచేశారు. దివ్య ప్రబంధాలలో ఆగమప్రస్యస్తి అనే వ్యాసంతోపాటు ఆగమశాస్త్రంలో చేసిన సేవలను గుర్తించి ఈ బిరుదును ప్రకటించారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీగోపాల దేశిక శతమాన మహోత్సవం సందర్భంగా ఈ బిరుదును అందజేశారని లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. గురువారం యాదాద్రి కార్యనిర్వాహక కార్యాలయంలో ఈవో ఎన్ గీత చేతులమీదుగా బిరుదు పత్రాన్ని స్వీకరించారు.