నల్లగొండ : ఇప్పటివరకు నల్లగొండ నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. వీటి కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 171 మందికి 66,08,800 రూపాయలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటి వరకు 5,000 దరఖాస్తులు పంపగా అందులో 3,700 దరఖాస్తులకు 17 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను, ఎల్వోసీలను పంపిణీ చేశామన్నారు. పార్టీలకతీతంగా పేద వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో వసతులు పెరిగినందున, పేద వర్గాల వర్గలవారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆశ్రయించకుండా ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని, ఇక్కడ వైద్యం అందుబాటులో లేకపోతే హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు వెళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కనగల్ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, సింగం రాంమోహన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామ రాజు యాదవ్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య లు, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.