చిట్యాల, నవంబర్ 23: ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లిన నల్లగొండ జిల్లావాసి అనారోగ్యం కారణంగా స్వదేశానికి తిరిగొస్తున్న క్రమంలో దుబాయ్లో మరణించాడు. నల్లగొం డ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన జనగాం మదార్గౌడ్ (50) మాలి దేశం వెళ్లి బోర్వెల్ వాహనంపై డ్రిల్లర్గా పనిచేస్తున్నాడు. స్వదేశానికి వస్తున్న సమయంలో దుబాయ్ ఎయిర్పోర్టులో ఆరోగ్యం క్షీణించడంతో విమాన సిబ్బంది అక్కడి ఓ దవాఖానలో చేర్పించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11.50 గంటలకు మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా తీసుకొచ్చేలా ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.