శాలిగౌరారం, డిసెంబర్ 27: సీనియర్ ఐఏఎస్ కుతాటి గోపాల్ను తమిళనాడు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమించింది. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన గోపాల్ స్వస్థలం నల్లగొండ జిల్లా శాలిగౌరారం. గోపాల్ మొదటి నుంచి తమిళనాడులోనే జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యలో గుంటూరు జిల్లాలో టొబాకో బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. స్టాలిన్ సీఎం అయిన తర్వాత నుండి పశుసంవర్ధక శాఖ, ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. గోపాల్ మంగళవారం స్టాలిన్ను కలిశారు. పేద కుటుంబం నుంచి ఐఏఎస్ అయ్యి.. సీఎస్ స్థాయికి ఎదిగిన గోపాల్ను శాలిగౌరారం వాసులు అభినందించారు.