నల్లగొండ: జాతిపిత మహాత్మాగాంధీకి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఆ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని రామగిరిలోగల మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీజీ ఆదర్శాలను, ఆశయాలను స్ఫూర్తి గా తీసుకుని, ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా అందరం నడువాలన్నారు.
సత్యాగ్రహం ఆయుధంగా శాంతి, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని, అయన అడుగుజాడల్లో అందరం నడువాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయని, ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆ కార్యాలయం పరిపాలనా అధికారి మోతీ లాల్ మహాత్ముని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి, చందన వదన, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.