నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ కు ఇన్ఫ్లో పెరగడంతో శుక్రవారం రాత్రి 11గంటలకు డ్యాం 2 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదలను ప్రా రంభించారు, ఇన్ఫ్లో తగ్గడంతో శనివారం ఉదయం 11గంటలకు నీటి విడుదలను నిలుపుదల చేశారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (31 1.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8755 క్యూసెక్కులు, ఎడమ కా ల్వ ద్వారా 8365 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఎస్ఎల్బీసీ, వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 50170 క్యూసెక్కుల అవు ట్ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885అడుగులకు ప్ర స్తుతం 880.80 అడుగులు (192.5300 టీయంసీలు) ఉంది. శ్రీశైలంకు 8412 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది.