BJP | మంచిర్యాల, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఏం ఒరగబెట్టావు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా ఊరికి వచ్చావు’ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నాగపురం గ్రామస్థులు నిలదీశారు. బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్నర్ మీటింగ్కు హాజరైన వివేక్ సహా పలువురు బీజేపీ నాయకులను గ్రామస్థులు అడ్డుకున్నారు.
ఎంపీ గా గెలిచి సొంత ఆస్తులను కాపాడుకుంటూ వేల కోట్లు వెనుకేసుకున్నావుగానీ.. పెద్దపల్లి పార్లమెం ట్ పరిధిలో ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశా వా? అని మండిపడ్డారు. ఓట్లు ఉంటే తప్ప కనిపించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్నర్ మీటింగ్ను బహిష్కరించి ‘వివేక్ గో బ్యాక్’ అంటూ అరగంటపాటు నినాదాలు చేశారు. విష యం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొ ని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. జనాలు ఎవరూ మీటింగ్కు రాకపోవడంతో అసహనంతో వివేక్ వెళ్లిపోయారు. బీజేపీ నాయకులు నాగపురం నుంచి వెళ్లిపోయాక గ్రామస్థులు శాంతించారు.
కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కొట్టుకున్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గోమాస శ్రీనివాస్ వర్గంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు వర్గం దాడి చేసింది. బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లిలో బుధవారం గోమాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా.. గతంలో పార్టీ నుంచి బహిష్కరించిన కొంద రు నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో పార్టీలో చేరేందుకు వస్తున్న నాయకులను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు వర్గీయులు బెల్లంపల్లిలో అడ్డుకోవడంతో గొడవ జరిగింది. భౌతిక దాడులకు పాల్పడటంతో పలువురికి గాయాలయ్యాయి.