హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కుమ్మరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం(టీఆర్కేఎస్) అధ్యక్షుడు నడికుడ జయంత్రావు డి మాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాను కచ్చితంగా సాధించుకుంటామని తే ల్చిచెప్పారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. కుమ్మరుల సమస్యల పరిషారం కోసం మే 17న ఓయూ ఫాకల్టీ క్లబ్ వేదికగా 33జిల్లాల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని, అదేరోజు భారీ బహిరంగ సభ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మట్టి పాత్రలతో పర్యావరణాన్ని కాపాడవచ్చని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఆధునిక నైపుణ్యాల కోసం 33 జిల్లాల్లో ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర వరిం గ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం, అసోసియేట్ అధ్యక్షుడు కేటీ శ్రీనివాస్, రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి దయానంద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ వీరేశం, నాయకులు రాచకొండ కృష్ణయ్య, ఏరుకొండ శ్రీనివాస్, ఖమ్మంపాటి సత్యనారాయణ, అగిరిశెట్టి వీరన్న, నిమ్మలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.