హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఏ స్థాయిలో మెరుగైందో నిరూపిస్తూ మంత్రి కే తారకరామారావు ‘నాడు-నేడు’ ట్వీట్ చేశారు. బాలానగర్, కోయిల్కొండలో కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఫొటోలను బుధవారం ఆయన షేర్చేస్తూ ‘బాలానగర్, కోయిల్కొండలోని ఆరోగ్య కేంద్రాలు నాడు, నేడు. నేటి ఫొటోలు ఆరోగ్య రంగానికి తెలంగాణలో ఏ స్థాయిలో ప్రాధాన్యం ఉన్నదో తెలియజేస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఆయన బృందానికి, జడ్చర్ల, నారాయణపేట ఎమ్మెల్యేలు సీ లక్ష్మారెడ్డి, ఎస్ రాజేందర్రెడ్డికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.