Indiramma House | చండ్రుగొండ, ఏప్రిల్ 22 : నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన నిరుపేదలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 42 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే.. అందులో అనర్హులనే ఎక్కువగా ఎంపిక చేశారని ఆరోపించారు. జాబితాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పేర్లే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అర్హులమైన తమకు ఇండ్లు మంజూరు చేయకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.