మద్దూర్(కొత్తపల్లి), ఏప్రిల్ 13 : బీఆర్ఎస్తోనే తన ప్రయాణం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా శనివారం నారాయణపేట జిల్లా మద్దూర్లో నిర్వహించిన కొత్తపల్లి, మద్దూరు మండలాల పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పట్నం హాజరై మాట్లాడారు.
తన సోదరుడు పట్నం మహేందర్రెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినా తాను మాత్రం కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై 120 రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు.