జమ్మికుంట, ఆగస్టు 29 : ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికే తాము మద్దతునిస్తామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ముస్లింలు స్పష్టంచేశారు. జమ్మికుంటలోని మసీద్ ఈ ఖాదర్ హలీమా కమిటీ అధ్యక్షుడు ఎండీ జాకీర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ముస్లింలు.. టీఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్కు ఏకగ్రీవ తీర్మాన ప్రతిని అందించారు. దీన్ని జీర్ణించుకోని కొందరు జాకీర్పై అసత్య ప్రచారాలు చేశారు. వాటిని ఖండిస్తూ ఆదివారం నాయకులు, ముస్లిం కుటుంబాలు మసీద్ నుంచి స్థానిక తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ తీశారు. టీఆర్ఎస్కే మద్దతు ఇస్తామని మరోసారి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.