పీర్జాదిగూడ, డిసెంబర్ 7: కండరాల క్షీణత వ్యాధితో బాధపగుతున్న ఓ యువతికి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించారు. చెన్నారెడ్డినగర్కు చెందిన వెంకటయ్య-శకుంతల దంపతుల పిల్లలు ‘కండర క్షీణత వ్యాధి’ అనే జన్యు సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని మేయర్ వెంకట్రెడ్డికి సూచించారు. ఈ సూచన మేరకు బుధవారం వెంకటయ్య సంతానంలో ఒకరైన భవానికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.