బొడ్రాయి బజార్: సూర్యాపేట పట్టణ ప్రజలు ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యలకు ముగింపు పలికే రోజు వచ్చింది. సూర్యాపేట జిల్లా కేం ద్రంలో టీయూఎఫ్ఐపీపీ తెలంగాణ అర్చన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు రూ 81కోట్లతో జమ్మిగడ్డలోని పుల్లారెడ్డి చెరువు వద్ద చేపట్టిన నీటి శుద్ధి కేంద్రం పనులు ముమ్మ రంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80శాతం పనులు పూర్తి కాగా మిగిలిన పనులు త్వరలోనే పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.ప్రజారోగ్య సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ పనులు 2018లో ప్రారంభం కాగా రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుం టకండ్ల జగదీశ్రెడ్డిల చోరవతో నీటి శుద్ధి కేంద్రం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
ఈ పనులు ముగిస్తే సూర్యాపేటలో ఉన్న ప్రధాన నాలాల గుండా వచ్చే వేస్టేజీ అంతా నేరుగా పైప్లైన్ల ద్వారా పుల్లా రెడ్డి చెరువులోకి పోకుండా ఈ శుద్ధీకరణ కేంద్రంలోకి మళ్లిస్తారు. తరువాత వచ్చే శుద్ధమైన నీటిని చెరువులోకి వదులు తారు. మిగిలిన వేస్టేజీని డంప్ యార్డుకు తరలిస్తారు.
నాలుగు భాగాలుగా నీటి శుద్ధీకరణ
గడిచిన మూడేండ్లుగా కొనసాగుతున్న ఈ పనులు సూర్యాపేట మున్సిపాల్టీ పరిధిలోని ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి పుల్లా రెడ్డి చెరువులోకి గత ప్రధాన నాలా శుద్ధీక రణ, అభివృద్ధి పనులతో పాటు మున్సిపాలిటీలోని అన్ని ప్రధాన వీధుల గుండా సుమారు 41కి.మీ మేరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేశారు.
ఈ నీటి శుద్ధి కేంద్రంలో నాలుగు భాగాలుగా రా వాటర్ సంప్, గ్రేట్ ఛాంబర్, ఎస్బీఆర్ ట్యాంక్, సీసీటీ ఛాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా నీటిని శుద్ధి చేసి చెరువులోకి పంపిస్తారు. ఇందులో నుంచి వేరు చేసిన వేస్టేజీని డంపు యార్డుకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు.
నీటి శుద్ది కేంద్రంతో తీరనున్న ఇక్కట్లు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన కాలువలు, నాలాల గుండా వచ్చే మురికినీరు జమ్మిగడ్డ సమీపంలోని పుల్లా రెడ్డి చెరువులోకి వచ్చి చేరేది. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో భరించలేని కంపుతో పాదచారులు, వాహన దారులు, నివాస ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. అంతే కాకుండా ఆ నీరు తాగిన మూగజీవాలు కూడా రోగాల బారిన పడడంతో పాటు చెరువు కింద ఉన్న పొలాలకు సరైన దిగుబడి వచ్చేది కాదు.
ఈ నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తి అయితే ఇందులో శుద్ధి అయిన జలాలను చెరువులోకి వదులుతారు. దీంతో దుర్వా సన పోవడంతో పాటు ఆ నీటిని రైతులు తమ పొలాలకు వాడుకొని అధిక దిగుబడి పొందవచ్చు. ఎన్నో ఏండ్లుగా ఎదు ర్కొంటున్న ఈ సమస్యను మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్తో మాట్లాడి నిధులు మంజూరు చేయించి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నో ఏండ్లుగా పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పరిష్కారం లభించింది.
దుర్వాసన తట్టుకోలేకపోతున్నాంఆనందంగా ఉంది: గుంటి సైదులు(22వ వార్డు, సూర్యాపేట)
పట్టణ ప్రజల మనసెరిగిన రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి నీటి శుద్దీకరణ కేంద్రం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. పట్టణంలోని మురుగునీరంతా నాళా ద్వారా వచ్చి పుల్లారెడ్డి చెరువులో కలుస్తుంది.
దీంతో తీవ్ర దుర్గందం వెలువడి తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. మంత్రి సమస్యను గుర్తించి పరిష్కరించడం ఆనందంగా ఉంది. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పనితీరును అభినందించాల్సిందే. నీటి శుద్ది కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి జగదీష్రెడ్డికి ప్రజలంతా రుణపడి ఉంటారు.
అభివృద్ధి పథంలో సూర్యాపేట : పెరుమాళ్ళ అన్నపూర్ణ(మున్సిపల్ చైర్పర్సన్, సూర్యాపేట)
సూర్యాపేట పట్టణం అభివృద్ది విషయంలో మంత్రి జగదీశ్రెడ్డికి ముందు తరువాత అన్నట్లుగా ఎంతో అభివృద్ది చెందుతుం ది. పట్టణ ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని పరిష్కరిస్తున్నారు మంత్రి జగదీశ్రెడ్డి. ఇప్పటికే పట్టణంలో సీసీ డ్రైనేజీలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి
మురుగునీటిని రీసైక్లింగ్ చేసి చెరువులోకి వదలడం హర్షణీయం. ఇలా శుద్ధి అయిన నీరు రైతుల అవసరాలకు వినియోగపడడమే కాకుండా వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తుంది. మంత్రి జగదీశ్రెడ్డి హయాంలోనే ఈ నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు కావడం ఆనందంగా ఉంది.
పనులు వేగవంతంగా జరుగుతున్నాయి : పి.రామాంజులరెడ్డి(మున్సిపల్ కమీషనర్, సూర్యాపేట)
నాళాలు, డ్రైనేజీల ద్వారా వచ్చే మురికినీటిని శుద్ధి చేసేందుకు రూ 81కోట్లతో నీటి శుద్ధి కేంద్రాన్ని పుల్లారెడ్డి చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే పట్టనంలోని అన్ని ప్రధాన రహదారుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేశారు. నీటి శుద్ధి కేంద్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 80శాతం పనులు పూర్తి కాగా త్వరలోనే అందుబా టులోకి తెచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నాం.