హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్కు సుపారీ గ్యాంగ్తో హత్యకు మహబూబ్నగర్కు చెందిన కొందరు కుట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తికి రూ.12కోట్ల సుపారీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఫరూక్ షేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును అరెస్టు చేశారు. నిందుతుల్లో ఒకడైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్రెడ్డి నివాసంలో రఘు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రఘుకు ఆశ్రయం ఇచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించి వదిలేశారు. హత్య కుట్ర కోణాన్ని ఢిల్లీ పోలీసులకు సైబరాబాద్ పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మరికొద్ది సేపట్లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్మీట్ నిర్వహించి, అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు.