ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన సురభివాణీదేవి గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యోగ సంఘాల నాయకుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులకు పట్టభద్రులు పట్టం కట్టారు.ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం అహర్నిషలు కృషి చేశారు. ప్రభుత్వం వెంటే ఉద్యోగులు ఉన్నారనేది ఈ గెలుపుతో ఖరారైంది.
గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
టీఎన్జీఓ కేంద్ర సంఘం పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లా శాఖ నేతృత్వంలో ఉద్యోగులందరికీ మన పాలన, మన బలం అనే నినాదంతో కృషి చేయడంతోనే ఎన్నికల్లో వాణీదేవి గెలుపొందింది. ఈ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఉద్యోగికి కృతజ్ఞతలు. -ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు.
సంక్షేమం, అభివృద్ధే గెలిపించాయి
రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నందునే పట్టభద్రులంతా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. రాష్ట్రంలో ప్రజల అభ్యున్నతితో పాటు ఉద్యోగుల సంక్షేమానికి పాటు పడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. టీఎన్జీఓ కేంద్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపునకు ఉద్యోగుల కృషి ఎంతగానో ఉంది. -గరిగబోయిన చంద్రశేఖర్, టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యదర్శి.
సీఎం కేసీఆర్తోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అహర్నిషలు కృషి చేసే ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరే. టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభివాణీదేవి గెలుపునకు ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయడం అభినందనీయం.- టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ.కృష్ణయాదవ్.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన ఘనత కేసీఆర్దే..
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఉద్యోగులు మద్దతు పలుకాలనే నినాదంతో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కృషి చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు నాంది పలుకడం అభినందనీయం. ఇందుకు గాను ప్రతి ఉద్యోగికి ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రం ఏర్పడిన అనంతరమే ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వంగా అడిగిన వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. -మామిళ్ల రాజేందర్, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు
గెలుపులో ఉద్యోగుల పాత్ర కీలకం
టీఆర్ఎస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైంది.సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలకు ఆకర్షితులై పట్టభద్రులు, ఉద్యోగులు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారు. -టీఎన్జీఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్
టీఆర్ఎస్తోనే సొసైటీ సభ్యులకు న్యాయం
భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యం లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిఒక్క సభ్యుడు గెలుపునకు దోహదపడడం అభినందనీయం. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఉద్యోగుల సమస్యలతోపాటు సొసైటీ సభ్యుల సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్తో సాధ్యం. – బీటీఎన్జీఓ సొసైటీ అధ్యక్షుడు, టీఎన్జీఓ కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణగౌడ్.