హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నదని, 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయన సోమవారం బుద్ధభవన్లోని ఎన్నికల కార్యాలయం లో మునుగోడు ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మంగళవారం సా యంత్రం 6 గంటల నుంచి సాధారణ ప్రచారంతోపాటు సోషల్ మీడియా ప్రచారంపై కూడా నిషేధం ఉంటుందని చెప్పారు. తనపై ఎలాంటి రాజకీయ ఒ త్తిళ్లు లేవని స్పష్టంచేశారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు ఆయన వివరణ ఇచ్చారనిచెప్పారు.