Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఆదినుంచి టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతున్నది. తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 3925 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొమ్మిదో రౌండ్లో కారు గుర్తుకు 7497 ఓట్లు, బీజేపీకి 6665 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీకి ఈ రౌండ్లో 832 ఓట్ల ఆధిక్యం లభించింది.
ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీకి 52,433, బిజేపి 49,243, కాంగ్రెస్ 14,596, బీఎస్పీ 2,063 ఓట్ల చొప్పున పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రస్తుతం 3925 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది.