నల్లగొండ: మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి జగదీశ్ రెడ్డి, వామపక్ష నేతలతో కలిసి నామపత్రాలు దాఖలు చేయనున్నారు. కాగా, సోమవారం ఉదయం మునుగోడు మండలం కొరటికల్లో ఉపఎన్నికల ప్రచారాన్ని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ.. మునుగోడు నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రికి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
మునుగోడులో ఆగిపోయిన అభివృద్ధి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)తోనే ముందుకు పోతుందన్నారు. అభివృద్ధికి పట్టంకట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మోసకారి రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరని, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయారని అందరికీ తెలున్నారు.