munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. చౌటుప్పల్ మండల పరిధిలోని నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 7380, బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకర్కు 907 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా టీఆర్ఎస్ 714 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి 228 పోలయ్యాయి. వీటితో కలుపుకుంటే నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీకి 26,671 ఓట్లు పోలయ్యాయి. కాగా టీఆర్ఎస్ పార్టీ 718 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.