Nirmal | పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినినగర్ కాలనీ, గాజుల్పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లారు. రెండు కాలనీల్లోని ఆరు ఇండ్ల యజమానులు పన్నులు చెల్లించడం లేదు. దీంతో రెవెన్యూ అధికారి అనూప్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆరు ఇండ్ల గేట్లను జప్తు చేసి ట్రాక్టర్లలో తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, బిల్ కలెక్టర్ ఆడె దినేశ్ ఉన్నారు.
-నిర్మల్ చైన్గేట్