సదాశివపేట, జనవరి 17: లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీ అధికారులకు దొరికాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని హౌసింగ్బోర్డులోగల ఓ వెంచర్లో ఇంటి నంబర్ కేటాయించాలని ఆకుల సంగమేశ్వర్ అనే వ్యక్తి గతనెల 25న మున్సిపల్ ఆర్ఐ వెంకట్రావును కోరారు. అందుకు ఆయన రూ.10 వేలు డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడి కుమారుడు శివకుమార్ ఆర్ఐతో ఒప్పందం చేసుకున్నాడు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో శివకుమార్ నుంచి ఆర్ఐ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు సదరు మొత్తాన్ని స్వాధీనం చేసుకొని, ఆర్ఐతోపాటు ఆయనకు సహకరించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల్శర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు.