హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో పట్టణాల ప్రగతికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిచ్చిందని, ఆ మేరకు మున్సిపల్ శాఖకు రూ.11,082 కోట్లు కేటాయించడమే నిదర్శనమని మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణాల్లో ప్రత్యేకంగా సమీకృత మారెట్ల నిర్మాణానికి రూ.400 కోట్లు, వైకుంఠధామాల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు.
బడ్జెట్లో మున్సిపాలిటీలకు అధిక కేటాయింపులకు చొరవ చూపిన సీఎం కేసీఆర్కు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు చాంబర్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాసాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లొద్దని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు రాజు వెన్రెడ్డి హితవు పలికారు. అవిశ్వాస తీర్మానాలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించినదని, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న మున్సిపాలిటీల్లో ఎలాంటి అలజడులు సృష్టించవద్దని కోరారు. ప్రభుత్వానికి, పార్టీకి మచ్చ తెచ్చే విధంగా నడుచుకోవద్దని కౌన్సిలర్లను కోరారు. సమస్యలుంటే చర్చల ద్వారానే పరిషరించుకోవాలని సూచించారు. సమావేశంలో దేవరకొండ, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్లు నరసింహ, రాజమౌళి, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ పాల్గొన్నారు.