- మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు. ఆ దిశగా రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్లు అందరూ క్రియాశీలకపాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు.
గురువారం హైదరాబాద్లో రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 129 మంది మున్సిపల్ చైర్మన్లు అప్రమత్తంగా ఉండి, బీజేపీ కుయుక్తులను తిప్పికొట్టాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్లు ఎదురొంటున్న సమస్యలను సామరస్యంగా పరిషరించుకోవాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చాంబర్ సంఘీభావం ప్రకటించింది. సమావేశంలో కార్యదర్శి ఎడ్మ సత్యం, చందు స్రవంతి, నర్సింహగౌడ్, బస్వరాజుగౌడ్, సుధా హేమేందర్గౌడ్, అనితా రామకృష్ణ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.