నేను రెండేండ్ల క్రితం అనారోగ్యం పాలైన. ప్రైవేట్ దవాఖానల సూపిచ్చుకుంటే రూ.4 లక్షల ఖర్చచ్చింది. ఆ కాగితాలు తీసుకొని సీఎంఆర్ఎఫ్ ఇప్పించమని మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ దగ్గరికి పోయిన. మూడుసార్లు తిరిగినా ముఖం కూడా సూడలె. కనీసం ఆర్థికసాయం కూడా చేయలె.
ఆపదల ఉన్నప్పుడు ఆదుకోకపోతె ఇంకెప్పుడు ఆదుకుంటడు. ఇప్పుడు ఓటెయ్యమంటే ఎటేస్త.. పక్కా కారు గుర్తుకే ఓటెస్త. సీఎం కేసీఆర్ ప్రజలకు ఏ హాని కలుగకుండా చూసుకుంటున్నడు. పంటలు పండించుకునేందుకు కాలువ తవ్వి నీళ్లు ఇడుస్తున్నడు. మాకు ఇంకేం కావాలి. మా ఓటు టీఆర్ఎస్కే.. కేసీఆర్కే. – రాంప్రభాకర్, టేకుర్తి (ఇల్లందకుంట)