అమెరికాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆంథాలజీ చిత్రం ‘మూడో కన్ను’. నాలుగు కథలుగా నలుగురు దర్శకులు తెరకెక్కించబోతున్నారు. సూరత్ రాంబాబు, కె.బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, సురేంద్రబాబు దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఈ నెల 26న విడుదలకానుంది.
మంగళవారం ట్రైలర్ను లాంచ్ చేశారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిదని, అనుక్షణం ఉత్కంఠను పంచుతూ సాగుతుందని దర్శకుడు తెలిపారు. సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, నిరోషా, కాశీవిశ్వనాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు: కె.వి.రాజమహి, సునీత రాజేందర్ దేవులపల్లి.