హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఫార్మా గ్రూప్ అయిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంగారెడ్డి జిల్లా కందిలో నెలకొల్పిన ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్ భారీ వంటశాలకు రెండు ఆహార రవాణా వాహనాలను సమకూర్చి ఔదార్యాన్ని చాటుకున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లోని పదివేల మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు వీటిని అందజేసింది. ఎంఎస్ఎన్ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఎస్ఎన్ గ్రూప్ కంపెనీల చైర్మన్ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి తమ కంపెనీ డైరెక్టర్లు సింధుజా రెడ్డి, నిఖిల్ తేజారెడ్డితో కలిసి అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యజ్ఞేశ్వర ప్రభుకు వాహనాలను అందజేశారు.