మేడ్చల్, ఫిబ్రవరి 9: పేద, మధ్యతరగతి విద్యార్థులకు రూ.5 కోట్ల విలువైన ఉపకార వేతనాలను వచ్చేవిద్యాసంవత్సరంలో అందించనున్నట్టు మల్లారెడ్డి వర్సిటీ వైస్చాన్స్లర్ వీఎస్కే రెడ్డి తెలిపారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వర్సిటీలో మల్లారెడ్డి విశ్వ విద్యాలయం ప్రవేశ పరీక్ష పోస్టర్ను ఆవిష్కరించిన మాట్లాడుతూ.. ఎంఆర్యూ సెట్ వచ్చే నెల 23, 24న ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపారు. అన్ని రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డు, ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులు మార్చి 22లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.