వేములవాడ రూరల్, అక్టోబర్ 9: అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వెంటనే వేములవాడ నియోజకవర్గంలో బీజేపీకి బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రుద్రవరం ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణ సోమవారం వందలాది మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అలాగే నుమిలిగుండుపల్లికి చెందిన యువకులు కూడా గులాబీ కండువా కొప్పుకొన్నారు.