MP Vaddiraju Ravichandra : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొనడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన కొరతను వెంటనే నివారించాల్సిందిగా భారత్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ ఉన్నతాధికారులను పెట్రోలియం పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులు, ఎంపీ రవిచంద్ర కోరారు.
హైదరాబాద్ నుంచి హన్మకొండకు ఆదివారం వెళ్తుండగా తాను పలు చోట్ల వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి ఉండడాన్ని గమనించానని ఫోన్ చేసి అధికారులకు వివరించారు ఎంపీ. పెట్రోల్, డీజిల్ కొరతను వెంటనే అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరడంతో సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారు.