హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): పెట్రోలియం డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి రాజ్యసభ సభ్యుడు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో మంత్రి హర్దీప్సింగ్ పురి, కమిటీ చైర్మన్ రమేశ్ విదౌరిని వద్దిరాజు కలిశారు. 25 రాష్ర్టాల పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తన దృష్టికి తెచ్చిన సమస్యలపై విదౌరికి వినతిపత్రం అందజేశారు. డీలర్లకు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మార్జిన్ చెల్లింపులో అన్యాయం జరుగుతున్న విషయాన్ని రవిచంద్ర వివరించారు.
రూపాయి మార్జిన్ చెల్లిస్తే 43 పైసలు ఆయిల్ మారెటింగ్ కార్పొరేషన్కు వెళ్తుందన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ హౌస్ అనెక్స్లో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ మొదటి సమావేశంలో చైర్మన్ రమేశ్ విదౌరి దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ఈ విషయంలో మంత్రి హర్దీప్సింగ్ చొరవ తీసుకొని డీలర్లకు వెంటనే న్యాయం చేసేలా చూడాల్సిందిగా విదౌరిని రవిచంద్ర కోరారు.