హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ సందర్శించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జైరాం రమేశ్ ఆధ్వర్యంలో గిర్ నేషనల్ పార్క్ను గురువారం సందర్శించినట్టు సంతోష్కుమార్ తెలిపారు. పార్కులో విశ్రాంతి తీసుకొంటున్న సింహాలను ఆయన తన కెమెరాలో బంధించారు. నేషనల్ పార్కు సందర్శనలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు.. అంటూ సింహాల ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.