MP Santhosh | తన జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్కు ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి గతంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటి కేటాయించారు. ఇందులో భాగంగా తొలి విడుతగా రూ.50లక్షల మంజూరు పత్రాన్ని మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతికి అందజేశారు.
మిగతా రూ.50లక్షలను వచ్చే ఆర్థిక సంవత్సరం నిధుల నుంచి విడుదల చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. పెట్లబుర్జు ఆసుపత్రి అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటానని, తనతో పాటు తన మిత్రులు కూడా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించేలా కృషి చేస్తానని ఎంపీ సంతోష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ తాను జన్మించిన దవాఖాన అభివృద్ధిపై చూపించిన ఆసక్తి మిగతా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.