ట్విట్టర్లో ఎంపీ సంతోష్కుమార్ అభినందన
హైదరాబాద్; జూన్ 6 (నమస్తే తెలంగాణ): పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ అభినందించారు. రోడ్డు ప్రమాదానికి గురై ఇటీవలే దవాఖాన నుంచి ఇంటికి వచ్చిన రామయ్య సోమవారం తన సతీమణి జానమ్మతో కలిసి ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లి-ముత్తగూడెం రహదారి మార్గంలో చిన్నచిన్న గుట్టలపై విత్తనాలు చల్లారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ముందుకు రావ డం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకున్నా..ఆయన మనసు మొక్కల పెంపకంవైపే లాగుతుంది..రామయ్యకు హ్యాట్సాప్ అంటూ ట్విట్టర్లో ఎంపీ సంతోష్కుమార్ కొనియాడారు.