సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబర్ 17: మోడువారిన మర్రి చెట్టును చిగురింప జేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ప్రకృతి ప్రకాశ్ కృషిని ఎంపీ సంతోష్కుమార్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా అభినందించారు. ‘మోడువారిన మర్రికి ప్రాణం’ శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రధాన సంచిక లో వచ్చిన కథనానికి స్పందించారు. ‘సంపూర్ణ దృఢత్వం, సంకల్పం, మీ లక్ష్యంపై మీకు స్పష్టమైన దృష్టి ఉన్నప్పుడు అనుకున్న పనులు కచ్చితంగా జరుగుతాయి.. ఈ బృహత్తరమైన చెట్టుకు పునర్జన్మ ఇవ్వడం స్ఫూర్తిదాయకం. ఈ వృక్షాన్ని సురక్షితమైన స్థలానికి తరలించడం నా బాధ్యత’ అంటూ సంతోష్ ట్వీట్ చేశారు.