హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): చిన్ననాటి నుంచి పర్వతారోహణ అంటే అమితంగా ఇష్టపడే గిరిజన విద్యార్థిని బానోతు వెన్నెలకు రాజ్యసభ్య సభ్యుడు సంతోష్కుమార్ ఆర్థికంగా అండగా నిలిచారు. ఈ నెల 19న దక్షిణాఫ్రికాలో 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో మంగళవారం ఆమె ప్రగతిభవన్లో ఎంపీ సంతోష్ను కలిసింది.
భవిష్యత్తులో ప్రపంచంలో అతిఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని ఈ సందర్భంగా వెన్నెల చెప్పింది. ఆమె పట్టుదలకు మంత్రముగ్ధడైన ఎంపీ వెంటనే రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెన్నెల స్వగ్రామం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారంపేట.