హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు నిజమయ్యాయని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh) అన్నారు. ఇది ముఖ్యమంత్రి కార్యదక్షతకు నిదర్శమని చెప్పారు. ఇప్పటికే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో 91,142 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మరో బహుమతి అందిచారని చెప్పారు.
‘నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదంతో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. స్వరాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణలో ఈ ఏడేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. తద్వారా గొప్ప సంపదను సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన లక్షకుపైగా ఉద్యోగాలు కాకుండా, ఇప్పుడు మరో 91,142 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ మరో బహుమతి అందించారు.
నీళ్లు-నిధులు-నియామకాల నినాదం నిజమయింది. దేశం అబ్బురపడే స్థాయిలో ఉద్యోగ నియామకాల ప్రకటన వచ్చింది. ఇది సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం. తెలంగాణ యువతకు శుభాకాంక్షలు. ఇది ఉద్యోగ నామ సంవత్సరం, ఆల్ ద బెస్ట్.’ అని ఎంపీ సంతోశ్ కుమార్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
“నీళ్లు- నిదులు- నియామకాల,
నినాదాలు నిజమయ్యాయి.”దేశం అబ్బురపడే స్థాయిలో ఉద్యోగ నియామకాల ప్రకటన వచ్చింది.
ఇది గౌరవ కేసీఆర్ గారి కార్యదక్షతకు నిదర్శనం.
తెలంగాణ యువతకు శుభాకాంక్షలు.ఇది ఉద్యోగ నామ సంవత్సరం,
ఆల్ ద బెస్ట్. #DildarCM #KCRHaiTohMumkinHai 💪 pic.twitter.com/N7voUBQQPT— Santosh Kumar J (@MPsantoshtrs) March 9, 2022
The icing on the cake is here, apart from more than 1 lakh employments that have been already given, now another gift from Honble CM #KCR sir who has just announced notification of another 91,142 posts👇.#DildarCM#KCRHaiTohMumkinHai
2/2 pic.twitter.com/YKZ6M3dceK
— Santosh Kumar J (@MPsantoshtrs) March 9, 2022